ఒక్క రోజులో రూ.13వేల 700 కోట్లు పెరిగిన సంపద.. కారణం ఒక బొమ్మ, షాకింగ్

ఒక్క రోజులో రూ.13వేల 700 కోట్లు పెరిగిన సంపద.. కారణం ఒక బొమ్మ, షాకింగ్

Labubu Dolls: ఒక బొమ్మ నిజంగా మనిషిని ఊహించని సంపన్నుడిగా చేయగలదా అంటే ప్రస్తుతం అని నిజమే అని నిరూపించబడింది. అవును చైనాలోని ఒక బొమ్మల వ్యాపారి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. 

వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన బొమ్మల తయారీ సంస్థ పాప్ మార్ట్ సీఈవో వాంగ్ నిన్జ్. వారు తయారు చేసిన లాబుబు బొమ్మ ఒక్కరోజులో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావటంతో అతని సంపద ఏకంగా 1.6 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.13వేల 700 కోట్లు పెరిగిపోయింది. ఒక్క రాత్రిలో సక్సెస్ కొట్టడం అంటే ఇదే. దీంతో సదరు వ్యాపారి మెుత్తం సంపద 18.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 

ALSO READ | ఆధ్యాత్మికం : ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి.. ఓకే ఓకే అన్నాడు అంటే వాడు నిజమైన స్నేహితుడు కాదా..?

ప్రస్తుతం అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అమెరికా నుంచి దీనికి విపరీతంగా కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది. మిస్టర్ లంగ్ పుస్తకం ప్రకారం, లబుబు ఒక ఎల్ఫ్, ఎత్తైన చెవులు, తోక లేని, అమాయకత్వం నుండి దుష్టత్వం వరకు విభిన్నమైన ప్రత్యేకమైన ముఖంతో విభిన్నమైన అమ్మాయి. లాబుబు ఆమె దయగల పాత్రకు ఆరాధించబడుతుంది. అనేక సంవత్సరాలుగా లాబుబును 300 కంటే ఎక్కువ రంగులు, దుస్తులు, పరిమాణాలు, ఇతివృత్తాలలో తిరిగి తీసుకొచ్చారు. అందుకే ప్రజల్లో దీనికి డిమాండ్ కొనసాగుతూనే ఉంది.