
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ ఇది. అల్లరి నరేష్సరసన ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్కు ఇది 59వ సినిమా. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు. " నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు.