బండి సంజయ్ పాదయాత్ర చూసి కేసీఆర్ కు చలి జ్వరం

బండి సంజయ్ పాదయాత్ర చూసి కేసీఆర్ కు చలి జ్వరం
  • నిజామాబాద్ ఎంపీ అరవింద్ 

నిజామాబాద్: కేంద్రం ఇస్తున్న లక్షల కోట్ల నిధులు కాళేశ్వరం ప్రాజెక్టు, కల్వకుంట్ల సొంత ఖాతాలోకి మల్లిస్తున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ గోశాల ను సందర్శించిన సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ గోశాల భూములు కబ్జా అవుతున్న అర్బన్ ఎం.ఎల్.ఏ. గణేష్ గుప్తా  పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

బండి సంజయ్ పాదయాత్ర చూసి సీఎం కేసీఆర్ కు చలిజ్వరం వచ్చిందని, సీఎం ఢిల్లీ టూర్ కూడా అందులో భాగమే అన్నారు. ప్రధానమంత్రి మోడీ  కేసీఆర్ ను కలిసేందుకు సమయం ఇచ్చింది 3.5 కోట్ల తెలంగాణ ప్రజల కోసమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్ మళ్లీ కేంద్రాన్ని డబ్బులు ఆడిగేందుకే ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించను అని లిఖిత పూర్వకంగా సీఎం కేసీఆర్ రాసివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అవినీతి నివేదిక, ఈ.డి. దర్యాప్తు చిట్టా ప్రధాని వద్ద ఉందని ఆయన హెచ్చరించారు.