సెన్సేషనల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. ఎన్టీయార్ బయోపిక్లో చూపించని ఏ వాస్తవాలను చూపిస్తారోనన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. రీసెంట్గా ఈ సినిమా రెండు రాష్ట్రాల హక్కుల్ని తొమ్మిది కోట్లకు అమ్మేశారన్న వార్తలు వచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజంలేదంటున్నాడు వర్మ. ఆ వివరాలన్నీ అతి త్వరలో తెలియజేస్తామని చెప్పాడు. సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయట. ఈ నెల 22న విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీ గురించిన ప్రతి చిన్న వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్కి, ఒక పాటకి మంచి రెస్పా న్స్ వచ్చింది. ఒక్క ఆర్జీవీ యూట్యూబ్ చానల్లోనే కోటి మందికి పైగా చూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నీ ఉనికి’ పాటను కూడా ముప్పై లక్షల మందికి పైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే జనాలు సినిమాకి కూడా బ్రహ్మరథం పట్టడం ఖాయం అంటున్నారు టీమ్ నమ్మకంగా. వారి నమ్మకం ఎంతవరకూ నిజమౌతుందో చూడాలి.
With the great NTR’s blessings #LakshmisNTR will be releasing on March 22nd pic.twitter.com/evcHPd9eIG
— Ram Gopal Varma (@RGVzoomin) March 1, 2019