బీజింగ్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ తీవ్రంగా నిరాశ పర్చాడు. టోర్నీ తొలి రౌండ్లోనే కెనడాకు చెందిన విక్టర్ లాయ్ చేతిలో తేడాతో ఓటమి పాలై ఇంటిబాట పట్టాడు. బుధవారం (సెప్టెంబర్ 2) పెన్జెన్ వేదికగా జరిగిన ఈ పోరులో ప్రపంచ ర్యాంకింగ్లో తొమ్మిదో స్థానంలో విక్టర్ కేవలం 38 నిమిషాల్లోనే 14-21, 7-21 తేడాతో భారత షట్లర్ను మట్టికరిపించాడు.
భారత షట్లర్ లక్ష్య సేన్ 4-0 ఆధిక్యంతో గేమ్ను ఘనంగా ఆరంభించాడు. కానీ చివరి వరకు ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. విక్టర్ లాయ్ బలంగా తిరిగి పుంజుకున్నాడు. వ్యూహాత్మక డిఫెన్స్తో భారత ఆటగాడిని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో లక్ష్యసేన్ ర్యాలీలను ఛేదించడానికి ఇబ్బంది పడుతూ మరింత ఎక్కువగా రిస్క్ తీసుకోవడం ప్రారంభించాడు. సేన్ పదేపదే బ్యాక్హ్యాండ్ సైడ్లైన్ వైపు షాట్లు మిస్ చేస్తుండటంతో ఒత్తిడి మరింత తీవ్రమైంది. లాయ్ ఆ పొరపాట్లను తనకు అనుకూలంగా మలుచుకుని తొలి గేమ్ను 21-14 తేడాతో గెలుపొందాడు.
తొలి రౌండ్ కోల్పోయిన లక్ష్య సేన్కు రెండో రౌండ్లో తిరిగి కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. బలమైన అటాకింగ్, డిఫెన్స్ గేమ్తో విక్టర్ లాయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 4-11తో వెనకబడ్డ లక్ష్యసేన్ పాయింట్ల అంతరాన్ని పూడ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మరిన్ని అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. కెనడియన్ ఆటగాడు రెండో గేమ్ను 21-7 తేడాతో కైవసం చేసుకున్నాడు. దీంతో తొలి రౌండ్ లోనే భారత ఆటగాడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
