
బార్సిలోనా: స్ట్రయికర్ లాల్రెమ్సియామి హ్యాట్రిక్ గోల్స్తో సత్తా చాటడంతో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ శనివారం జరిగిన మ్యాచ్లో 3–0తో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. స్పానిష్ హాకీ ఫెడరేషన్ 100వ వార్షికోత్సవ ఇంటర్నేషనల్ టోర్నీలో భాగంగా జరిగిన ఈ పోరులో లాల్రెమ్సియామి13, 17, 56వ నిమిషాల్లో గోల్స్ చేసింది. దాంతో, గత రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ (1–1), స్పెయిన్ (2–2) జట్లతో రెండు డ్రాల తర్వాత ఈ టోర్నీలో ఇండియా తొలి విజయం ఖాతాలో వేసుకుంది. సవిత కెప్టెన్సీలోని టీమ్ ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉంది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్లో స్పెయిన్తో పోటీ పడనుంది.