ఆస్తి తగాదా : తమ్ముడి కుటుంబాన్ని షూట్‌‌ చేసి చంపిన అన్న

ఆస్తి తగాదా : తమ్ముడి కుటుంబాన్ని షూట్‌‌ చేసి చంపిన అన్న

ఆస్తి తగాదా ఐదుగురి ప్రాణాలు తీసింది

సాగర్‌‌‌‌(మధ్యప్రదేశ్‌‌): అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్‌‌లోని సాగర్‌‌‌‌ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అన్నదమ్ములు మనోజ్‌‌ అహిర్వార్‌‌‌‌, సంజయ్‌‌ అహిర్వార్‌‌‌‌ పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. ఇంటి ముందు రోడ్డు వేసే విషయంలో స్థలం దగ్గర గొడవ తలెత్తింది.

దీంతో మనోజ్‌‌ అహిర్వార్‌‌‌‌, అతని కొడుకులు ఇద్దరు కలిసి సంజయ్‌‌ కుటుంబంపై దాడి చేశారు. తమ దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరపటంతో సంజయ్‌‌, అతని భార్య, పిల్లలు, మరో మహిళ చనిపోయారు. ఇంట్లోనే ఉన్న మరో మహిళ, ఇద్దరు పిల్లలు తప్పించుకున్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు మనోహర్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.