నిర్ణీత గడువులోగా భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ హనుమంతు

నిర్ణీత గడువులోగా భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ హనుమంతు

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌/బాల్కొండ, వెలుగు:  ‘భూభారతి’  దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా భూ సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బుధవారం జక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముప్కాల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌మండలంలోని నల్లూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాల్కొండ మండలంలోని కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ గ్రామాల్లో భూభారతి సదస్సులను పరిశీలించి మాట్లాడారు. ఒకే ఫారంలో రైతులు మూడు రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చన్నారు.  ప్రతి ఫిర్యాదును ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని,  ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజిట్‌‌‌‌‌‌‌‌ చేసి వాస్తవాలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, స్టాఫ్ పని తీరును పరిశీలించారు. కలెక్టర్​ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్లు, కిరణ్మయి, శ్రీధర్, ముంతాజీబుద్దిన్ తదితరులు ఉన్నారు. 

అంతకు ముందు ‌‌‌‌‌‌‌‌నగరంలోని వినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఈవీఎం గోదామ్‌‌‌‌‌‌‌‌ ను పరిశీలించారు. ఈవీఎం, బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూనిట్లు భద్రపర్చిన గదుల సీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. సీసీ కెమెరాలు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కలెక్టర్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయేందర్‌‌‌‌‌‌‌‌
 ‌‌‌‌‌‌‌‌ఉన్నారు.