ట్రక్కుపై పడిన కొండచరియలు..ఇద్దరి మృతి

ట్రక్కుపై పడిన కొండచరియలు..ఇద్దరి మృతి

జమ్మూ కశ్మీర్లో ఓ ట్రక్కుపై కొండచరియలు విరిగి పడటంతో ఇద్దరు మృతి చెందారు. ట్రక్కు తత్రి నుంచి గొండో కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ 27 ఏళ్ళ షహజాద్ హుస్సేన్, 22 ఏళ్ళ కండక్టర్ ఆరిఫ్ హుస్సేన్ మరణించారు.