
పంజాగుట్ట, వెలుగు: హాస్టళ్లలో ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న వ్యక్తులను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టుచేశారు. ఏసీపీ వెంకటరమణ వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బెస్తవారి పేటకు చెందిన బండ్లమూడి ఆవులయ్య(30) ఎర్రగడ్డలోని మెట్రో స్టేషన్తోపాటు గచ్చిబౌలి, కొండాపూర్లో సెక్యూరిటీ గార్డుగా గతంలో పనిచేశాడు. ఆ తర్వాత సులువుగా డబ్బులు సంపాదించాలని పీజీ హాస్టళ్లలో ల్యాప్టాప్లు దొంగిలిస్తున్నాడు. వాటిని నేరేడ్మెట్లో సెల్ఫోన్లు రిపేరు చేసే నందిగామ వెంకట కృష్ణ(33)తోపాటు అంబర్పేట్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి మేకల వెంకటేశ్వర్లుకు అమ్మేవాడు. పక్కా సమాచారంతో డిటెక్టివ్ఇన్స్పెక్టర్ఎం.గోపాల్, సిబ్బంది కలిసి వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు.