
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసుకదా’. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్స్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్తో షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు ఇదే సమయంలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నెలలో మొదటి పాటను విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది.