పార్ల‌మెంట్ లో ప్రధానిపై నీళ్లు చల్లిన చట్టసభ్యుడు.. వీధి రౌడీల్లా కొట్టుకున్న ఎంపీలు

పార్ల‌మెంట్ లో ప్రధానిపై నీళ్లు చల్లిన చట్టసభ్యుడు.. వీధి రౌడీల్లా కొట్టుకున్న ఎంపీలు

డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ కొసావోకు చెందిన శాసనసభ్యుడు మెర్గిమ్ లుష్టాకు.. ప్రధానమంత్రి అల్బిన్ కుర్తి మాట్లాడుతుండగా.. ఆయన వద్దకు వచ్చి అతనిపైకి నీరు విసరడంతో ఘర్షణకు దారితీసింది.

ఆగ్నేయ ఐరోపా దేశమైన కొసావో పార్లమెంటు రణరంగంగా మారింది. పార్లమెంట్ లోని చట్టసభ సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, తోసుకుంటూ కుమ్మేసుకున్నారు. ప్రధానమంత్రి అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా..  ఓ ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌ తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అందరూ కొట్టుకున్నారు. వారికి మహిళా సభ్యులు కూడా తోడయ్యారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయననపై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రధాని కుర్తీ ప్రసంగిస్తుండగా.. కొసావో డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు మెర్గిమ్ లుష్తకు ఆయన వద్దకు వెళ్లి బాటిల్‌లోని నీళ్లు విసిరారు. దీంతో పార్లమెంటులో ఒక్కసారిగా కలకలం రేగింది.  

 

Brawl breaks out in the Kosovo Parliament after an Opposition MP threw water at the Prime Minister.pic.twitter.com/OP2DG0F9YX

— The Spectator Index (@spectatorindex) July 13, 2023