నాదర్ గుల్భూములపై ఆరోపణలు అవాస్తవం : న్యాయవాది మాధవరావు

నాదర్ గుల్భూములపై ఆరోపణలు అవాస్తవం : న్యాయవాది మాధవరావు
  • రాజకీయ లబ్ధి కోసమేమంత్రి పొంగులేటి ఫ్యామిలీపై తప్పుడు ప్రచారం
  • న్యాయవాది మాధవరావు

పంజాగుట్ట, వెలుగు: రంగారెడ్డి జిల్లా బాలాపూర్​మండలం నాదర్​గుల్​గ్రామంలోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ప్రముఖ న్యాయవాది మాధవరావు స్పష్టం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి రాజా శివరాజ్​బహదూర్​వారసులకు చెందిన ప్రైవేట్ పట్టా భూమి అని, దీనిని 2011లో హైకోర్టు, 2015లో సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించాయని తెలిపారు.

ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లను సైతం కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షరెడ్డికి ఈ వ్యవహారంతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఆయన 2021 నుంచి 2023 వరకు మాత్రమే ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ కంపెనీలో డైరెక్టర్​గా ఉన్నారని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ‘పాట్​ ఖరాబ్’ (వ్యవసాయానికి పనికిరానిది) గా నమోదై ఉందని, ప్రస్తుతం ఈ భూమి వారసుల ఆధీనంలోనే ఉందని తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న అంశాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం పొంగులేటి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.