ఫామ్ హౌస్ కేసు.. 5 గంటలుగా లాయర్ శ్రీనివాస్ విచారణ

ఫామ్ హౌస్ కేసు.. 5 గంటలుగా లాయర్ శ్రీనివాస్ విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది శ్రీనివాస్‭ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఐదు గంటలుగా విచారణ జరుగుతోంది. సింహయజీ స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశాడని శ్రీనివాస్ పై ఆరోపణలు వచ్చాయి. అక్టోబర్ 26న తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చేందుకు సింహయజీ స్వామికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు సిట్ గుర్తించింది. అతడితో లాయర్ శ్రీనివాస్‭కు ఉన్న పరిచయాలపై సిట్ ఆరా తీస్తోంది. అసలు ఫ్లైట్ టికెట్ బుక్ చేపించిన వ్యక్తులు ఎవరు..? అన్న దానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 

ఫోన్ కాల్ లిస్ట్, బ్యాంకు లావాదేవీల ఆధారాలతో శ్రీనివాస్ ను అధికారులు విచారిస్తున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. మరోవైపు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. విచారణకు హాజరుకావాలని అధికారులు ఇప్పటికే నోటీసులు పంపారు. వీరు ముగ్గురు కూడా ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వారు రానట్లు తెలుస్తోంది.