న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి : మంద నగేశ్కోరారు

న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి : మంద నగేశ్కోరారు

నల్గొండ అర్బన్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్  అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేశ్​కోరారు. అడ్వకేట్​నరేశ్​ ​ఇంటిపై దాడిని ఖండిస్తూ గురువారం విధులు బహిష్కరించి, కోర్టు సముదాయం నుంచి క్లాక్​టవర్​వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులు వెంకటేశ్వర్లు, ఠాగూర్, భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, కిశోర్ కుమార్, శేఖర్, రాములు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. నల్గొండ బార్ అసోసియేషన్ సభ్యుడు, అడ్వకేట్ నరేశ్​  కుటుంబసభ్యులపై దుండగుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ఎంఎస్.రాఘవరావు, ఉప్పల గోపాలకృష్ణమూర్తి, జక్కుల వీరయ్య పాల్గొన్నారు.