
ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని గాలికొదిలేసిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. బుధవారం చలో సచివాలయం చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి స్టూడెంట్ లీడర్లు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సరిగ్గా మౌలిక వసతులు లేవన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్సిప్ విడుదల చేయకపోవడంతో కాలేజీ విద్యార్థులు పైచదువులకు వెళ్లలేకపోతున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.