అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల ఆందోళన

అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల ఆందోళన

హైదరాబాద్ : అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం ముందు ప్రజాసంఘాల నాయకులు గురువారం (జూన్ 22న) ఆందోళనకు దిగారు. ప్రజా ఉద్యమకారులపై పెట్టిన ఉపా కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉపా యాక్ట్ ను ఎత్తి వేయాలని విమలక్క డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మేధావులపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బిరెల్లి ఘటనను సాకుగా చూపిస్తూ తమపై ఉపా కేసులను నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను రాష్ట్రంలో రద్దు చేయాలని, తమపై పెట్టిన కేసులన్నింటినీ వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు విమలక్క.