దేవాదుల పైప్ లైన్కు లీకేజీ.. వృధాగా పోతున్న నీరు

దేవాదుల పైప్ లైన్కు లీకేజీ.. వృధాగా పోతున్న నీరు

హనుమకొండ జిల్లా: దామెర మండలం పులుకుర్తి సమీపం లోని దేవాదుల పైప్ లైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో భారీగా నీరు  వృధాగా పోతోంది. చలివాగు ప్రాజెక్ట్ నుంచి భీమ్ ఘనపూర్ వెళ్తున్న పైప్ లైన్ కు లీకేజీ ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి చలివాగు వద్ద మోటార్లను నిలిపివేశారు. వృధాగా పోతున్న నీరు పూర్తిగా నిలిచిపోవడానికి మధ్యాహ్నం వరకు పట్టవచ్చని అధికారులు తెలిపారు. దేవాదుల పైప్ లైన్ లీకేజీతో వందలాది ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయి. పంటలన్నీ దెబ్బతిన్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.