
ఎస్ఏఆర్ గ్రూప్కు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ ఎల్ఎక్స్ఎస్ జీ3.0, ఎల్ఎక్స్ఎస్ జీ2.0 ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఎల్ఎక్స్ఎస్ జీ2.0 మోడల్ రూ. 1,03,000 ధరకు లభిస్తుండగా, ఎల్ఎక్స్ఎస్ జి3.0 ఈ--స్కూటర్ ధర ఇంకా వెల్లడి కాలేదు. గుర్గావ్ ఆధారిత కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్లను ప్రారంభించింది. డెలివరీలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమవుతాయి.