శ్రీచైతన్య విద్యార్థినితో లెక్చరర్ అసభ్య ప్రవర్తన

శ్రీచైతన్య విద్యార్థినితో లెక్చరర్ అసభ్య ప్రవర్తన

జీడిమెట్ల, వెలుగు:  విద్యార్థినితో శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్​అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది.  స్థానికులు, విద్యార్థి సంఘాల నేతలు తెలిపిన ప్రకారం..  బాచుపల్లి హిల్​కౌంటీకి వెళ్లేదారిలోని శ్రీ చైతన్య గర్ల్స్​క్యాంపస్​లో ఓ విద్యార్థిని (17) ఇంటర్​ సెకండియర్​ చదువుతోంది.   మంగళవారం ఎగ్జామ్స్​ ఉండటంతో  కాలేజీ బస్సులో వెళ్లి తిరిగి అదే బస్సులో వస్తుండగా..  కాలేజీ కి చెందిన లెక్చరర్​ మహేశ్​పక్కన కూర్చొని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.  

క్యాంపస్​కి వచ్చిన అనంతరం విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు ఫోన్​చేసి చెప్పింది. వెంటనే వారు  కాలేజీ మేనేజ్ మెంట్ కు  ఫిర్యాదు చేయడంతో మహేశ్​తో పాటు కాలేజీ ఇన్​చార్జ్ ని సస్పెండ్​చేసినట్లు తెలిసింది. అయితే ఇది బయటకు తెలియనీయకుండా మేనేజ్ మెంట్ జాగ్రత్తలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమాచారం తెలియడంతో విద్యార్థి సంఘం నేతలు కాలేజీవద్ద వద్ద ఆందోళనకు దిగి మేనేజ్ మెంట్ కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

నిందితులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థిని భవిష్యత్ దృష్ట్యా ఫిర్యాదు చేసేందుకు కుటుంభసభ్యులు వెనుకాడినట్టు తెలిసింది. దీనిపై బాచుపల్లి సీఐ ఉపేందర్​ని వివరణ కోరగా  తమకు ఫిర్యాదు రాలేదని, ఒకవేళ చేస్తే విచారణ జరిపి చర్యలు తీసకుంటామని చెప్పారు.