- అరవింద్ కుమార్కు నోటీసులు పంపిన పీసీసీ చీఫ్
- రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కామెంట్
- బేస్ ప్రైస్ను ఇప్పటికీ ఎందుకు బయటకు పెట్టట్లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్ లీజు విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తనకిచ్చిన లీగల్ నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వాపస్ తీసుకోకుంటే తాను సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం అరవింద్ కుమార్కు నోటీసులు పంపించారు. ‘మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో అరవింద్ కుమార్కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక ఐఏఎస్ చేసే పనికి సంబంధించి ఎన్నో సర్వీస్ రూల్స్ ఉంటాయి. కానీ, అరవింద్ కుమార్వాటిని పాటించడం లేదు. అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా ఎదురుదాడికి దిగుతున్నారు.
ఆలిండియా సర్వీసెస్ రూల్స్ (కండక్ట్) 1968 ప్రకారం.. ఓ ఐఏఎస్ అధికారి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకుండా తటస్థంగా పనిచేయాలి. అరవింద్కుమార్అధికార పార్టీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు’అని రేవంత్ ఫైరయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం సెక్రటేరియెట్కు వెళ్తే ఎంపీనని కూడా చూడకుండా అడ్డగించి తనను అరెస్టు చేయించారని మండిపడ్డారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే నోటీసులిచ్చారని ఆరోపించారు.
నివేదికలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లే?
ఓఆర్ఆర్ సగభాగం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకే వస్తుందని రేవంత్అన్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. దానికి గండికొట్టేలా ఐఆర్బీ ఇన్ఫ్రా అనే సంస్థకు కేవలం రూ.7,380 కోట్లకే 30 ఏండ్లపాటు ఎలా లీజుకిస్తారని ప్రశ్నించారు. టెండర్ను కట్టబెట్టే క్రమంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారని ఆరోపించారు. ‘హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్2031తో ముగుస్తుంది. ఆ తర్వాత అది మారిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో 30 ఏండ్లపాటు లీజుకిస్తే సమస్యలు వస్తాయి. దేశంలో ఏ రోడ్ టెండర్నూ 20 ఏండ్లకు మించి ఇవ్వలేదు. టోల్వసూలు చేసే టెండర్కాలపరిమితి 15 నుంచి 20 ఏండ్ల వరకే ఉండాలని నేషనల్హైవేస్ అథారిటీ ఆఫ్ఇండియా (ఎన్హెచ్ఏఐ) రూల్స్ పెట్టింది. ఎన్హెచ్ఏఐ అభ్యంతరాలనూ పక్కనపెట్టి 30 ఏండ్ల కాలానికి సంస్థకు టెండర్ ఇచ్చారు. రూల్స్కు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఓ రిటైర్డ్ ఆఫీసర్ను నియమించారు. టెండర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ను కాదని హెచ్ఎండీఏని ముందు పెట్టారు. ఓఆర్ఆర్ బేస్ ప్రైస్ ఎంతో చెప్పాలని ఎన్ని సార్లు అడిగినా బయటపెట్టడం లేదు. ఓఆర్ఆర్పై ట్రాఫిక్, టెండర్ విలువపై మజర్స్ చేసిన నివేదికనూ పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. ఇవన్నీ కూడా టెండర్ల ప్రక్రియలో ఏదో గోల్మాల్ జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నది’అని రేవంత్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
వాపస్ తీస్కునే ప్రసక్తే లేదు రేవంత్ నోటీసులకు హెచ్ఎండీఏ రిప్లై
ఏపీ రేవంత్ రెడ్డికి ఇచ్చిన లీగల్ నోటీసులను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హె చ్ఎండీఏ) తేల్చి చెప్పింది. ఓ బాధ్యతగల ఎంపీగా ఉండి కొందరు సీనియర్ అధికారులకు రాజకీ య ఉద్దేశాలను ఆపాదించి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. లీగల్ నోటీసులను వెనక్కు తీసుకోవాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోటీసులపై హెచ్ఎండీఏ ప్రకటనను రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారమే హెచ్ఎండీఏ అధికారులు పనిచేస్తారని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి పర్యవేక్షణలో నిబంధనల ప్రకారం పనిచేస్తారని, ఓఆర్ఆర్ టెండర్లలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే తటస్థంగా పనిచేశారని తెలిపింది. కానీ, ఆ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొంది. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలనే లీగల్ నోటీసులు ఇచ్చామని తేల్చి చెప్పింది.
పారదర్శకంగా టెండర్ ప్రక్రియ
ఓఆర్ఆర్ టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (ఓఆర్ఆర్ టీవోటీ) టెండర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్టు హెచ్ఎండీఏ స్పష్టం చేసింది. ఎన్హెచ్ఏఐ నిర్దేశించిన టీవోటీ నిబంధనలను విధిగా పాటించే టెండర్ను ఖరారు చేశామని తెలిపింది. రాష్ట్ర కేబినెట్ ఆమో దం మేరకే సంస్థకు 30 ఏండ్ల పాటు టీవోటీ బిడ్ను ఇచ్చామంది. ఎంపీ రేవంత్ రెడ్డి ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టుకున్న సమాచారమంతా ఇచ్చామని,తాము ఏ సమాచారాన్ని దాచలేదని స్పష్టం చేసింది.