ఎల్జీ మెడికల్ కాలేజీ పేరు మార్పు పై కేటీఆర్ సెటైర్

ఎల్జీ మెడికల్ కాలేజీ పేరు మార్పు పై కేటీఆర్ సెటైర్

గుజరాత్ ప్రభుత్వం సహా కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడీ కాలేజీగా మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంను నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చారని విమర్శించారు.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలసీతారామన్ కు అవకాశం వస్తే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మకు బదులు మోడీ బొమ్మ పెడతారేమో అని ఎద్దేవా చేశారు. 

మణినగర్లోని ఎల్జీ కాలేజీ పేరును నరేంద్ర మోడీ కాలేజీగా పేరు మారుస్తూ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నిర్ణయం తీసుకుంది. 2002లో మోడీ మణినగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే గెలిచారు. 2003లో అక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన..ప్రజలు తన ఆఫీసును ఎప్పుడైనా సందర్శించొచ్చని ప్రకటించారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ కాలేజీని పునరుద్ధరించడంతోపాటు కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించారు