కామారెడ్డి, వెలుగు: పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపించాలని చెప్పినందున తమను పోలీసులు తహసీల్దార్ముందు బైండోవర్చేశారని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్సర్పంచ్ మైలారం రవీందర్రెడ్డి కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చే ప్రైవేట్స్కూల్ బస్సులను సర్పంచ్రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్మహేందర్ఆపేస్తున్నారని కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్ను తాడ్వాయి పోలీసులు ఇటీవల తహసీల్దార్ఎదుట బైండోవర్చేశారు. ప్రభుత్వ స్కూల్కు పిల్లలను పంపాలని తాము కోరామని, ప్రభుత్వ బడి బాగు గురించి తాము కృషి చేస్తే తమను బైండోవర్ చేశారని ఫిర్యాదు చేశారు.
