జడ్చర్ల, వెలుగు : కార్మికుల హక్కులకు భంగం కలిగేలా తీసుకొచ్చిన లేబర్ కోర్టులను రద్దు చేయాలని బుధవారం జడ్చర్ల పట్టణంలో ఎల్ఐసీ ఉద్యోగులు ధర్నా చేశారు. సీఐటీయు. ఏఐటీయూసీతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గురువారం జరుగనున్న దేశవ్యాప్త సమ్మే విజయవంతం చేయాలని ఐక్యకార్యాచరణ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, కార్యాచరణ రూపొందించినట్లు సీఐటీయూ జిల్లా నాయకులు ఆకుల వెంకటేశ్, కృష్ణ, తెలుగు సత్తయ్య, అనిల్కుమార్ తెలిపారు.
