పీఎస్​యూలో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకే ఎక్కువ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ .. క్యూ4లో రూ.19,013 కోట్లు సాధించిన కంపెనీ

పీఎస్​యూలో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకే ఎక్కువ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ .. క్యూ4లో రూ.19,013 కోట్లు సాధించిన కంపెనీ
  • ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ లాభం రూ.18,643 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ) ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో (క్యూ4)  మిగిలిన ప్రభుత్వ కంపెనీల కంటే ఎక్కువ లాభం సంపాదించింది. క్యూ4లో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ రూ.19,013 కోట్ల నెట్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ను పొందింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.13,763 కోట్లతో పోలిస్తే 38 శాతం గ్రోత్ నమోదు చేసింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ) క్యూ4లో రూ.18,643 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 

ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ తర్వాత రెండో స్థానంలో ఉంది.  కానీ, మొత్తం 2024–25లో మిగిలిన ప్రభుత్వం కంపెనీల కంటే ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ ఎక్కువ లాభం పొందింది. దీని యాన్యువల్ ప్రాఫిట్ రూ.70,901 కోట్లకు పెరగగా, ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ లాభం రూ. 48,151 కోట్లుగా ఉంది.