పట్టపగలు నడిరోడ్డుపై మద్యం వ్యాపారిని దుండగులు కాల్చి చంపిన ఘటన రాజస్థాన్లో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాగోల్డికి చెందిన మద్యం వ్యాపారి లక్ష్మణ్దేవాసి(45)తన మేనల్లుడు రమేష్తో కలిసి స్కార్పియోలో 68వ నెంబరు జాతీయ రహదారిపై వెళ్తున్నాడు.
సాంచోర్ పట్టణంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును అడ్డగించారు. అనంతరం వెంట తెచ్చుకున్న తుపాకులతో దేవాసిపై కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని మేనల్లుడు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశాడు.
సీసీ కెమెరాల్లో ఘటన వీడియో..
ఈ దాడికి సంబంధించిన ఘటన విజువల్స్ స్థానికంగా ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఓ ప్లాన్ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. ముందు కారు అద్దాలు ధ్వంసం చేసి ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
హత్య వార్త తెలియగానే ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి చుట్టు పక్కల జిల్లాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. దెబ్బతిన్న వాహనాన్ని పోలీస్స్టేషన్లో ఉంచినట్లు సంచోర్లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మంగీ లాల్ రాథోడ్ వెల్లడించారు.