ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచే తిండే ముద్దంటున్నారంతా. ఇమ్యూనిటీ కోసం తినదగ్గ వాటిల్లో జింక్ ఒకటి. కొవిడ్ బారిన పడ్డ వారు తొందరగా కోలుకునేందుకు, కొవిడ్ లక్షణాలు తగ్గడానికి యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ మాదిరిగానే జింక్ కూడా పనికొస్తుందని అంటున్నారు సైంటిస్ట్స్.
రోజుకు 50మి. గ్రా జింక్ తీసుకుంటే కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవచ్చని చాలా స్టడీస్ చెబుతున్నాయి. ‘‘కరోనా ముప్పును తప్పించడం, కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించడంలో జింక్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా జింక్ లోపం ఉన్నవాళ్లు, మొండి జబ్బులతో బాధపడేవాళ్లు, పెద్దవాళ్లు జింక్ ఉన్న ఫుడ్ తింటే మంచిది. దాంతో వీళ్లలో వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది”అని ఇంటిగ్రేటెడ్ జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీ చెబుతోంది. జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువని, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయని అంటున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ సీనియర్ లెక్చరర్ స్కాట్. రోజుకు 20మిల్లీ గ్రాముల జింక్ తీసుకున్నా చాలు. అయితే 50మిల్లీ గ్రాములు తీసుకుంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ల ముప్పు తప్పుతుంది. జింక్ సప్లిమెంట్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉత్పత్తి తగ్గుతుందని ఎన్నో స్టడీస్ ఇప్పటికే చెప్పాయి.