బెంగాల్ గవర్నర్కు చేదు అనుభవం
కోల్కతా:బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ షాక్ తిన్నారు. ఆయన రాకపోకలను సాగించేందుకు కేటాయించిన గేటుకుతాళం వేశారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం .. గవర్నర్ రావడానికి, పోవడానికి మూడో నెంబర్ గేటు ని ఉపయోగిస్తారు. అయితే గురువారం మాత్రం అలా జరగలేదు. ‘‘గవర్నర్పదవికే” ఇది అవమానం అని ఈ ఘటనపై గవర్నర్ సీరియస్ అయ్యారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన అన్నారు.
మూడో నెంబర్ గేటు కాకుండా మీడియా, అధికారులకు కేటాయించిన గేటు నెంబర్ 4 గుండా గవర్నర్ అసెంబ్లీలోకి వెళ్లారు. “మూడో నెంబర్ గేటుఎందుకు క్లోజ్ చేశారు? ముందుగా సమాచారం ఇచ్చినా గేటును మూసేశారు. అసెంబ్లీ వాయిదా పడిందంటే దానర్థం మూసేసినట్టుకాదు. ఇది నాకు జరిగిన అవమానం కాదు. మొత్తం రాష్ట్రప్రజలకు, రాజ్యాంగానికి జరిగిన అవమానం”అని గవర్నర్ జగదీప్అక్కడున్న మీడియాకు
చెప్పారు.
ఏం జరిగిందంటే?…
అసెంబ్లీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలిస్తానని, లైబ్రరీని కూడా చూస్తానని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీకి గవర్నర్ బుధవారమే లెటర్ రాశారు. ‘‘టూర్కు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్కు పంపించాం. ఆ తర్వాత రాజ్భవన్ స్పెషల్ సెక్రటరీకి అసెంబ్లీ సెక్రటరీ నుంచి మెసేజ్ వచ్చింది. నన్ను రమ్మని వాళ్లు ఆహ్వానించారు. నా భార్యను కూడా లంచ్కి ఇన్వైట్చేశారు. దీంతో నేను ఆ ఇన్విటేషన్కు ఓకే చెప్పాను. గంటన్నర తర్వాత మరో మెసేజ్ వచ్చింది. దాంట్లో ఇన్విటేషన్ రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ నా స్పెషల్ సెక్రటరీకి మెసేజ్ ఇచ్చారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ ఇద్దరూ ఉండడంలేదని మెసేజ్ సారాంశం.
ఆ గంటన్నరలోపే ఏ జరిగిందో నాకు ఆశ్చర్యం కలిగించింది. తనకు జరిగిన అవమానంపై స్పీకర్కు లెటర్ రాస్తాను”అని గవర్నర్ మీడియాకు వివరించారు. రాజ్యాంగపరమైన పదవులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవాన్ని ఇవ్వడంలేదని తృణమూల్ సర్కార్ తీరుపై గవర్నర్ ఫైర్ అయ్యారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు గవర్నర్ అప్రూవల్ రాలేదని చెబుతూ మంగళవారం స్పీకర్ అసెంబ్లీని రెండురోజులపాటు వాయిదా వేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్న దాంట్లో ఎలాంటి నిజంలేదని రాజ్భవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.