హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపటి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్లో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించక తప్పనిసరి ఏర్పడిందంటూ సర్కార్ ప్రకటించింది. లాక్ డౌన్ సందర్భంగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా జరుపుకోవచ్చని సర్కార్ ప్రకటించింది. కేవలం నాలుగు గంటలపాటు ప్రజలు బయట తిరిగేందుకు అనుమతిచ్చినా.. బ్యాంకుల సేవల విషయంలో కాస్త విధానాలు మారాయి. బ్యాంకులు మధ్యాహ్నం 12 వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోతారు. లాక్డౌన్ మినహాయింపు సమయం ఉదయం 10 గంటల వరకే కాబట్టి 12 తర్వాత ఇళ్లకు వెళ్లే బ్యాంకుల సిబ్బంది రోడ్డుమీద బందోబస్తు పోలీసులు ప్రశ్నిస్తే బ్యాంకు సిబ్బంది తమ ఐడీ కార్డులు చూపించాల్సి ఉంటుంది.
బ్యాంకుల పని వేళల్లో మార్పులు
- బిజినెస్
- May 13, 2021
లేటెస్ట్
- మెదక్ పార్లమెంట్ నామినేషన్ల పరిశీలన పూర్తి
- నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం
- గుడుంబా స్థావరాలపై దాడులు
- పకడ్బందీగా పోస్టల్ బ్యాలెట్స్ నిర్వహించాలి : చిత్ర మిశ్రా
- వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు
- హన్మకొండలో నకిలీ క్లీనిక్లను గుర్తించిన అధికారులు
- వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్ఠాకూర్
- నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ జాబ్స్
- ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు
- తెలంగాణాలో 150 జడ్జి పోస్టులు.. పూర్తి వివరాలివే!
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి