రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కరోనా కేసులు పెరగడం కరోనా తీవ్రత సూచిస్తోందన్నారు సీఎం కేసీఆర్. కరోనా విజృంభణపై ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం అంతటా అంతటా ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58 మంది కరోనా బాధితులున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, హోం క్యారంటైన్ లో కానీ ఉన్నారన్నారు. వీరి కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా నిరోధక చర్యల్లో ప్రజల సహకారాన్ని ప్రశంసించారు. ప్రజలు సహకరించకుంటే కరోనా విస్ఫోటనం చెందేదని, జరిగే నష్టాన్ని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. అయితే… లాక్ డౌన్ విధించినా, రాత్రివేళల్లో కర్ఫ్యూ పొడిగించినా ఇవాళ ఒక్కరోజే 10 కేసులు రావడం ఆందోళనకరమని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధో, అర్థం చేసుకుంటే అంత సింపుల్ వ్యాధి అని చెప్పారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదని… ఉన్న మందు ఏదంటే దీని వ్యాప్తిని నిరోధించడమేనన్నారు. కరోనాపై సరైన నివారణ చర్యలు తీసుకోని ఫలితంగా అన్ని వసతులు ఉన్న అమెరికా దేశం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపారు. మనదేశంలో సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు ఏకైక మార్గమని చెప్పారు. చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలో ప్రబలితే 20 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాంట్లో మనం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు ఎవరూ అతీతులు కారని, ఈ విపత్తు సమయంలో స్వీయరక్షణే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. అయితే, కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీతో కూడా మాట్లాడానని, ఆయన కూడా అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారన్నారు.
ఏప్రిల్ 15 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ : కేసీఆర్
- హైదరాబాద్
- March 27, 2020
లేటెస్ట్
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
- బీజేపీలో పలువురు చేరిక
- ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి
- ప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
- కడియం జాతకం బయటపెడ్తా: ఆరూరి రమేశ్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి