
కొడిమ్యాల,వెలుగు : కొద్దిరోజులుగా సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో అంగన్వాడీలు ఓపెన్ చేయడం లేదు. దీంతో బుధవారం మల్యాల,కొడిమ్యాల మండలాల్లో ఐసీడీఎస్అధికారులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జీపీ కార్యదర్శులకు అప్పజెప్పారు.