తెలంగాణ బీజేపీ: లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా

తెలంగాణ బీజేపీ: లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా

తెలంగాణ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆ పార్టీ సెక్రెటరీ జేపీ నడ్డా. శుక్రవారం తొలి జాబితాను విడుదల చేయగా.. అందులో 10 మంది పేర్లు ఉన్నాయి. ఈ రోజు మరో ఆరుగురి పేర్లను ప్రకటించారు.

అదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి సోయం బాబూ రావు,
పెద్దపల్లి – ఎస్ కుమార్,
జహీరాబాద్ – బాణాల లక్ష్మారెడ్డి,
హైదరాబాద్ – భగ్వానాథ్ రావు,
చేవెళ్ల – బీ. జనార్ధన్ రెడ్డీ,
ఖమ్మం – వసుదేవ రావు పేర్లను ఫైనల్ చేశారు.

తొలి జాబితాలో ప్రకటించిన వారి పేర్లు:  మల్కాజ్‌గిరి – రామచంద్రరావు, సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ – డీకే అరుణ, నాగర్‌కర్నూలు – బంగారు శ్రుతి, కరీంనగర్‌ – బండి సంజయ్‌, నిజామాబాద్‌ – డి. అరవింద్‌, నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్‌, భువనగిరి – పీవీ శ్యామ్‌సుందర్‌ రావు, వరంగల్‌ – చింతా సాంబమూర్తి, మహబూబాబాద్‌ – హుస్సేన్‌నాయక్ పేర్లను నిన్న ప్రకటించారు.

వీరితో పాటు.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ముగ్గురి పేర్లను, కెరళ నుంచి ఒకరిని, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరిని ఈ లీస్ట్ లో ప్రకటించారు. 

కెరళ, పథానామతిట్టా లోక్ సభ  స్థానం సురేంధ్రన్
ఉత్తర్ ప్రదేశ్, కైరానా లోక్ సభ  స్థానం నుంచి ప్రదీప్ చౌదరీ, నగినా – యశ్వంత్, బులంద్ షహర్ – భోలా సింగ్,
వెస్ట్ బెంగాళ్.. జంగీ పూర్ లోక్ సభ  స్థానం నుంచి మఫుజా కాటన్.. బరిలో ఉన్నారు.