ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి: లోక్ సభ స్పీకర్

ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి: లోక్ సభ స్పీకర్

చట్టసభలపై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుంటారని.. విలువైన ప్రజా సమమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. అసోం కొత్త శాసనసభ భవనాన్ని స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేవాలయాలు చట్టసభలన్నారు. విస్తృత చర్చలు జరిగితేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.

ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలన్నారు. అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా శాసనసభ, లోక్ సభలో చర్చలు జరగాలన్నారు ఓంబిర్లా. 75ఏండ్ల ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో సామాజిక-ఆర్థిక అభివృధ్ధి ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు.