లోకేష్ బందరు పోర్ట్ కామెంట్ కు కేటీఆర్ ట్వీట్

లోకేష్ బందరు పోర్ట్ కామెంట్ కు కేటీఆర్ ట్వీట్

తెలంగాణ సీఎం కేసీఆర్.. మచిలీపట్నం పోర్టును ఎత్తుకువెళ్లాలి అనుకుంటున్నారంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో ఒకరేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. లోకేష్ కామెంట్స్ ని ఓ నెటిజన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేశాడు.  ‘‘ ఈ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ కి ఓటు వేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే.. తెలంగాణకు మచిలీపట్నం పోర్టు తేవడంలో కేసీఆర్, కేటీఆర్ ఫెయిల్ అయ్యారు’’ అంటూ ఓ నెటిజన్ .. లోకేష్ కి కౌంటర్ గా చేసిన ట్వీట్ కి కేటీఆర్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీలను తన ట్వీట్ కి సమాధానంగా పెట్టారు.