
చిలప్ చెడ్, వెలుగు : రేషన్ బియ్యం కోసం వినియోగదారులు దుకాణాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో డీలర్లు వినియోగదారుల నుంచి మూడు సార్లు బయో మెట్రిక్ తీసుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతోంది. శుక్రవారం మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చో లేక రేషన్షాప్ ముందు ఖాళీ సంచులు క్యూలైన్లో పెట్టారు.