మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో రేషన్ బియ్యం కోసం పడిగాపులు

మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో రేషన్ బియ్యం కోసం పడిగాపులు

 చిలప్ చెడ్, వెలుగు :  రేషన్ బియ్యం కోసం వినియోగదారులు దుకాణాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో డీలర్లు వినియోగదారుల నుంచి మూడు సార్లు బయో మెట్రిక్​ తీసుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరికి  దాదాపు 20 నిమిషాల సమయం పడుతోంది. శుక్రవారం మెదక్​ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో  నిల్చో లేక  రేషన్​షాప్​ ముందు ఖాళీ సంచులు క్యూలైన్​లో పెట్టారు.