అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల హ్యారిస్ కు విషెస్ తెలిపారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ. అధ్యక్షుడిగా సక్సెస్ ఫుల్ గా పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు రామ్ నాథ్ కోవింద్. ఇండియా-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేస్తామన్నారు. బిడెన్, కమల హ్యరిస్ కు వెంకయ్యనాయుడు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియా-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని మరింత శాంతియుతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
భారత్ -అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. మీ విజయం భారతీయ అమెరికన్లందరికీ గర్వకారణమంటూ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ను కూడా అభినందించారు మోడీ. హారిస్ మద్దతుతో భారత్ -అమెరికా సంబందాలు మరింత బలపడ్తాయని ట్వీట్ చేశారు.
Congratulations @JoeBiden on your spectacular victory! As the VP, your contribution to strengthening Indo-US relations was critical and invaluable. I look forward to working closely together once again to take India-US relations to greater heights. pic.twitter.com/yAOCEcs9bN
— Narendra Modi (@narendramodi) November 7, 2020
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం బిడెన్, హారిస్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధికి అమెరికా – భారత్ కలిసి కృషి చేద్దామని ట్వీట్ చేశారు.