శివసేన ఉద్దవ్ బాల్ సాహెబ్ థాక్రే నాయకుడు ఉద్ధవ్ థాకరే బీజేపీ పార్టీ పై విమర్శలు గుప్పించారు. రాముడు ఒకే పార్టీకి చెందిన ఆస్తి కాదని అన్నారు. బాల్ థాకరే జయంతి సందర్భంగా నాసిక్ లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తన తండ్రి దివంగత బాల్ థాకరే స్థాపించిన పార్టీని దొంగిలించారని ఆరోపించారు. షిండేపై రామాయణ ఇతిహాసంలోని రాజు వాలి గుణమని విమర్శించారు.
వానర రాజు వాలిని రాముడు ఎందుకు చంపాడో అర్థం చేసుకోవాలని ఉద్ధవ్ చెప్పారు. శివసేనతో విడిపోయిన నేటి వాలిని (రాజకీయంగా) కూడా చంపాలని సూచించారు. శివసేన కాషాయ జెండాను మోసం చేసిన కొందరు రాజకీయా నాయకులను తాము ఖచ్చితంగా రాజకీయ హత్య చేస్తామని అన్నారు.