తన కూతురు నేహా హిరేమత్ ది ముమ్మాటికీ లవ్ జిహాద్ హత్యేనని ఆమె తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ అన్నారు. తన కూతురు ప్రేమను నిరాకరించినందుకే నిందితుడు ఫయాజ్ కత్తితో పొడిచి చంపాడు..ఇది లవ్ జిహాదీ కాకుంటే ఏంటని ప్రశ్నించారు. ఇటీవల గొప్పింటి ఆడపిల్లలను ట్రాప్ చేయడం ..లవ్ జిహాద్ కు ప్రయత్నించడం,కాదంటే దాడులు చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. లవ్ జిహాద్ కు చాలా మంది తమ కూతుళ్లను కోల్పోతున్నారు.. అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకోండి అని కర్ణాటక కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఏప్రిల్ 18న కర్ణాటకలోని హుబ్బళ్లిలోని బీవీబీ కళాశాలలో కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కూతురు నేహా హిరేమత్ దారుణ హత్యకు గురైంది. ఫయాజ్ అనే యువకుడు ఆమెను అతి కిరాతకంగా 9సార్లు కత్తితో పొడిచి చంపాడు. కాలేజ్ క్యాంపస్ సీసీటీవీలో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. దీంతో కర్ణాటకలో పెను దుమారం రేగింది. బీజేపీ దీనిని లవ్ జిహాదీ హత్య అని ఆరోపిస్తుండగా కాంగ్రెస్ దీనిని తోసిపుచ్చింది. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడిన మృతురాలి తండ్రి నిరంజన్ లవ్ జిహాదీ హత్యేనని ఆరోపించారు.
Love jihad spreading, take care of your girls: K’taka Cong Corporator and father of murder victim pic.twitter.com/i6eXX5Jjom
— IANS (@ians_india) April 19, 2024