యువతిని రాడ్డుతో కొట్టి చంపిండు

యువతిని రాడ్డుతో కొట్టి చంపిండు

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని ప్రేమికుడు ఐరన్ రాడ్ తో కొట్టి చంపాడు. పార్కులో మర్డర్ చేసి, డెడ్ బాడీని అక్కడి బెంచ్ కింద పడేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం మాలవీయనగర్​లో జరిగింది. నర్గీస్(23), ఇర్ఫాన్(28) దగ్గరి బంధువులు. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. నర్గీస్ ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, కోచింగ్ తీసుకుంటున్నది. ఇర్ఫాన్ ఖాళీగా ఉంటున్నాడు. నర్గీస్​ను పెండ్లి చేసుకుంటానని ఇర్ఫాన్ అడగగా.. అతడికి జాబ్ లేదని నర్గీస్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. నర్గీస్ ఇర్ఫాన్ తో మాట్లాడడం మానేసింది. దీంతో, ఇర్ఫాన్ కోపం పెంచుకున్నాడు. ఆమె మాలవీయ నగర్​లో కోచింగ్ తీసుకుంటోందని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. మాట్లాడాలని చెప్పి నర్గీస్​ను అరబిందో కాలేజీ దగ్గర్లోని పార్కుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడి,  ఐరన్ రాడ్​తో తలపై కొట్టాడు. నర్గీస్ స్పాట్​లోనే చనిపోయింది. డెడ్ బాడీని బెంచ్ కింద పడేసి ఇర్ఫాన్ పారిపోయాడు. పార్కుకు వచ్చిన స్థానికులు డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఇర్ఫాన్ ను అరెస్టు చేశారు. 

కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్.. 

ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. మహిళల హత్యలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ‘‘ఢిల్లీలో మరో కూతురు హత్యకు గురైంది. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సీరియస్ ఇష్యూగా మారింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి, ఎల్జీకి విజ్ఞప్తి చేస్తున్నాను” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.