
- రూ. 2 కోట్ల గ్రాంట్ ప్రకటించిన
- అస్సాం సీఎం హిమంత
గువాహతి: ఇండియా స్టార్ బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గోహైన్ తన కలల ప్రాజెక్టును ప్రారంభించింది. నార్త్ గువహటిలోని బార్చంద్రలో బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈ అకాడమీని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాంఛనంగా ప్రారంభించారు. అకాడమీ డెవలప్మెంట్ కోసం సీఎం రూ.2 కోట్ల గ్రాంట్ ప్రకటించారు. దాంతో పాటు అథ్లెట్ల కోసం హాస్టళ్ల నిర్మాణం, భూసేకరణ, కోచింగ్ సిబ్బంది ఖర్చుల వంటి విషయాల్లోనూ అండగా ఉంటామని లవ్లీనాకు హామీ ఇచ్చారు. 2021లో కొనుగోలు చేసిన స్థలంలో లవ్లీనా ఈ అకాడమీని నిర్మించింది. 2024 ఒలింపిక్స్ తర్వాత పూర్తిగా సొంత ఖర్చులతో అకాడమీ పనులు ప్రారంభించినట్లు లవ్లీనా తెలిపింది. 2028 నాటికి దేశం గర్వించదగ్గ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ బాక్సర్లను తయారు చేయడమే తన టార్గెట్ అని చెప్పింది.