బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఒకటి రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతం ఆగ్నేయం- నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. నవంబర్ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. 

పశ్చిమం- మధ్య బంగాళాఖాతం వైపు అల్పపీడనం క్రమంగా విస్తరిస్తుందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.