అమ్మినోళ్లు, కొన్నోళ్ల మధ్య ఎల్ఆర్ఎస్ లొల్లి
ప్లాట్ల రెగ్యులరైజేషన్కు భారంగా మారిన ఓపెన్స్పేస్ ఫీజులు
లక్షల్లో ఉండడంతో ఎవరు కట్టాలనే దానిపై పంచాయితీలు
శిఖం, అసైన్డ్ భూముల్లో ప్లాట్లు కొన్నవాళ్లలో ఆందోళన
దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు
సర్కారు తీరుపై అయోమయంలో సామాన్యులు
యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన సురేష్ రెండు నెలల కింద గజానికి రూ. 10 వేల చొప్పున రూ. 20 లక్షలతో 200 గజాల ప్లాటు కొన్నాడు. అడ్వాన్సుగా రూ. 5 లక్షలు ఇచ్చి, మిగిలిన అమౌంట్ రెండు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు సర్కారు ఎల్ఆర్ఎస్ తెచ్చింది. దీని కింద రెగ్యులరైజేషన్ ఫీజు రూ. 24 వేలు కాగా, ఓపెన్ ప్లేస్ వ్యాల్యూ 14 శాతం ఫీజు కింద రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఓపెన్ ప్లేస్ వ్యాల్యూ ఫీజు తాను చెల్లించే ప్రస్తకే లేదని సురేష్అంటున్నాడు. ముందే ఓపెన్స్పేస్ తీసేస్తే ఆ రేటుకు ప్లాట్ఇచ్చేవాడినే కాదని రియల్టర్అంటున్నాడు. దీంతో వీళ్లిద్దరి నడుమ పంచాయితీ నడుస్తోంది.
యాదాద్రి/జనగామ, వెలుగు: సర్కారు తన ఖజానా నింపుకోవడానికి తెచ్చిన ఎల్ఆర్ఎస్ కారణంగా భూములు అమ్మినవారు, కొన్నవారి నడుమ పంచాయితీలు మొదలయ్యాయి. ముఖ్యంగా 10 పర్సెంట్ ఓపెన్ స్పేస్వదలని వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు, ప్లాట్ మార్కెట్ వ్యాల్యూలో 14 శాతం ఫీజు చెల్లించాల్సి వస్తోంది. దీంతో తామెందుకు నష్టపోవాలని కొన్నవారు అమ్మినవారిని నిలదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్లాట్లు ఇప్పటికే అనేక చేతులు మారడంతో ఇప్పుడీ వ్యవహారం అందరి మెడకూ చుట్టుకొని, చివరికి రియల్టర్ల వద్దకు వచ్చి ఆగుతోంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనివారైతే అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల కొన్నవారు, అమ్మినవారు చెరోసగం భరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అసైన్డ్, శిఖం, ఎఫ్ టీఎల్ భూముల్లోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేయబోమని ఆఫీసర్లు చెబుతుండడంతో కొన్నవాళ్లంతా లబోదిబోమంటున్నారు.
ఎవరు భరించాలి?
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఏరియాల్లో3,892, రూరల్ ఏరియాల్లో 11 వేల అక్రమ వెంచర్లు, వీటి పరిధిలో 14,95,745 ప్లాట్లు రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయని ఆఫీసర్లు తేల్చారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్స్కీమ్కింద రెగ్యులరైజ్చేసుకుంటే తప్ప ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయబోమని సర్కారు చెబుతోంది. ఫీజులు చూస్తే వేలకు వేలు ఉండడంతో ఎలా కట్టాలో తెలియక సామాన్యులు సఫర్ అవుతున్నారు. రెగ్యులరైజ్ఫీజులు కాస్త అందుబాటులోనే ఉన్నప్పటికీ 10 శాతం ఓపెన్ప్లేస్ వదలని వెంచర్లలోని ప్లాట్లకు ‘ప్రోరాట ఓపెన్ స్పేస్చార్జెస్’ కింద ప్లాట్ వ్యాల్యూలో ఏకంగా 14 శాతం ఫీజులు వసూలు చేస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. అర్బన్ ఏరియాల్లో 200 గజాల ప్లాటుకు లక్షకు పైగా, రూరల్ ఏరియాల్లో సుమారు రూ.40 వేల దాకా అవుతుండడంతో ఈ మొత్తాన్ని అమ్మినవారు భరించాలా.. కొన్నవారు భరించాలా అనే ప్రశ్న వస్తోంది. రియల్టర్లు, భూయజమానులు చేసిన తప్పులకు తామెందుకు బలికావాలని కొన్నవారు ప్రశ్నిస్తున్నారు. తాము ముందే ఓపెన్స్పేస్ వదిలితే ప్లాటు ఎక్కువ రేటుకు అమ్మేవాళ్లమని, ఆ మేరకు తక్కువ ధరకు ఇచ్చినందున కొన్నవాళ్లే భరించాలని రియల్టర్లు, భూయజమానులు అంటున్నారు. దీంతో చాలాచోట్ల ఈ వ్యవహారం అమ్మినవాళ్లు, కొన్నవాళ్లకు మధ్య గొడవలకు దారితీస్తోంది. కొన్నిచోట్ల అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లయితే అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
శిఖం భూములకు నో ఎల్ఆర్ఎస్
రాష్ట్రవ్యాప్తంగా పలువురు లీడర్లు, రియల్టర్లు శిఖం, ఎఫ్టీఎల్, అసైన్డ్ భూముల్లో వెంచర్లు చేసి సామాన్యులకు అమ్మి పత్తా లేకుండా పోయారు. తక్కువ ధరకు వస్తున్నాయని చెరువులు, కుంటలు అని చూడకుండా కొనుగోలు చేసినవారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గవర్నమెంట్ ప్రకటించిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం వీళ్లకు వర్తించడం లేదు. ఎందుకైనా మంచిదని ఎఫ్టీఎల్, శిఖం, కాలవల సమీపంలో కొన్నవాళ్లంతా అప్లై చేస్తున్నా ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారు. కొందరి అప్లికేషన్లను ప్రస్తుతానికి తీసుకుంటున్నా ఫీల్డ్ విజిట్ చేసే టైంలో ఎక్కడ రిజెక్ట్చేస్తారోనని భయపడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్– వరంగల్ హైవే మీద అత్యంత కీలకమైన జనగామలో ల్యాండ్కు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ రంగప్ప చెరువు, కొత్త కుంట, గార్లకుంట, బతుకమ్మకుంట, కుమ్మరి కుంట, బుడుగు కుంటను ఆనుకొని శిఖం, ఎఫ్టీఎల్పరిధిలో సుమారు వెయ్యి నుంచి 1500 పైగా ప్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు వాటిని కొన్నవారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. రూల్స్ప్రకారం వెళ్తే ఆఫీసర్లు వీటిని ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్చేయరు. ఒకవేళ ఇదే జరిగితే ఈ భూములను అమ్మిన రియల్టర్లు, లీడర్లను కొన్నవాళ్లు నిలదీయడం ఖాయం. ఈ తరహా గొడవలు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.
For More News..