13 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కొడుకుతో కలిసి దూకిన మహిళ.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..

13 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కొడుకుతో కలిసి దూకిన మహిళ.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..

ఢిల్లీలో గ్రేటర్​ నోయిడా వెస్ట్ లోని ఏస్​సిటీలో ఓ మహిళ కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.11ఏండ్ల కొడుకుతో కలిసి భవనం13 వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. బాలుడు న్యూరో డెవలప్​మెంటల్​ డిజార్డర్​తో బాధపడుతున్నాడని మానసికంగా కృంగిపోయిన ఆమహిళ ఆత్మహత్యకు పాల్పడిఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

గ్రేటర్ నోయిడా వెస్ట్​ లోని ఏస్ సిటీలో శనివారం ఉదయం 37 ఏళ్ల మహిళ, ఆమె 11 ఏళ్ల కుమారుడు తమ ప్లాట్​ లోని 13వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలుడు న్యూరో డెవలప్​ మెంటర్​ డిజార్డర్​ కు చికిత్స పొందుతున్నాడని, క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఫ్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్​ లోఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చార్టర్డ్​ అకౌంట్​ గా పనిచేస్తున్న చిన్నారి తండ్రి మరో గదిలో ఉండగా అరుపు విని పరుగెత్తి చూడగా భార్య, కొడుకు కింద నేలపై పడి మృతిచెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్​  మార్టమ్​ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆమె రాసిన సూసైడ్​ లెటర్.. ​  

మేం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం.. క్షమించండి.. మేం ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకుంటన్నాం.. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు అని మహిళ సూసైడ్​ నోట్​ లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు.  

ఆ చిన్నారి చాలా కాలంగా చికిత్స పొందుతోందని..పాఠశాలకు వెళ్లడం లేదని, మందులపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అపార్టుమెంట్  లోని ఉండేవాళ్లు తెలిపారు. చేతివ్రాత నిపుణులతో నోటును  పరిశీలిస్తున్నారు.