పంచాయతీల్లో అనుమతి లేని ప్లాట్లు 12 లక్షలపైనే
1.22 లక్షల గుంటల్లో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఆఫీసర్లు
ఒక్కో ప్లాటుకు సగటున రూ 20 వేలకు పైగా భారం
జనగామ, వెలుగు: పల్లెలకూ ఎల్ఆర్ఎస్ ఫికర్పట్టుకుంది. జీపీ తీర్మానం ఉన్నా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందేననే రూల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. లే అవుట్విషయంలో పంచాయతీ పాలకవర్గాల తీర్మానాలు చట్ట విరుద్ధమని ఆఫీసర్లు చెబుతున్నారు. డీటీసీపీ పర్మిషన్ ఉన్న వెంచర్లకే మినహాయింపు ఇచ్చారు. సర్కారు ఆర్డర్తో గ్రామాలవారీగా ఉన్న అక్రమ లే అవుట్వెంచర్లు, ప్లాట్ల లెక్కలను తేల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 12,766 పంచాయతీల పరిధిలో 12,14,574 అన్ అప్రూవుడ్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో మొత్తంగా16,22,681 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో నాలుగోవంతు 4,08,107 మాత్రమే అప్రూవుడ్ ప్లాట్లుగా ఉన్నాయి. మిగతావన్నీ రూల్స్కు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ప్లాట్ల ఓనర్ల నుంచి కంపల్సరీగా ఎల్ఆర్ఎస్చార్జీలు వసూలు చేయాలని సర్కారు ఆర్డర్స్ ఉన్నాయి.
14 వేల వెంచర్లు
రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 539 మండలాల్లో 12,766 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షా22 వేల గుంటల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,568 వెంచర్లకు మాత్రమే లే అవుట్ ఉంది. ఇక మిగిలిన 11,001 వెంచర్లకు లేఅవుట్ లేదు. వీటి పరిధిలోని 12 లక్షలకు పైగా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధి జీపీల్లో 1,807, అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 18 అక్రమ వెంచర్లు ఉన్నాయి.
ఒక్కో ప్లాటుకు సగటున రూ.20 వేల ఖర్చు
పల్లెల్లోనూ ఎల్ఆర్ఎస్ పేరిట వేలకు వేలు వసూలు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఉదాహరణకు ఒక ఊరిలో 200 గజాల ప్లాటు ఉండి దాని రిజిస్ట్రేషన్ వ్యాల్యూ గజానికి రూ 500 ఉన్నట్లయితే సదరు వ్యక్తికి రూ రూ. 30,700లు ఖర్చు కానుంది. అదే 150 గజాల ప్లాటు ఉండి, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ 500 అయితే రూ. 23 వేల చార్జీలు పడనున్నాయి. గ్రామాల్లో కనీసం 150 గజాలకు పైనే ప్లాట్ల కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే గ్రామాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువగా ఉంది. ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా రేటు ఉంది. నేషనల్ హైవేలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో గజానికి రూ .800 నుంచి 1200 వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు ఉన్నట్లు రిజిస్ట్రార్ఆఫీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన గ్రామాల్లో రూ.200 నుంచి 600 వరకు గజానికి రిజిస్ట్రేషన్ ధరలు ఉన్నాయి. ఈ చార్జీలు తక్కువగా ఉన్నా కూడా సరాసరిగా ఒక్కో ప్లాటు ఓనర్ నుంచి రూ.20 వేల వరకు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
గీ టైంల కష్టమే
గ్రామీణ ప్రాంతాలను ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావడం పై విమర్శలు ఎక్కువయ్యాయి. పట్టణాల్లో రీ సేల్పర్పస్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. కానీ పల్లెల్లో గూడు కట్టుకోవడానికే కొంటుంటారు. ఎక్కువ మొత్తం ప్లాట్లు ఈ కోవలోకే వస్తాయి. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కట్టాలన్న ప్రభుత్వ హుకుం పల్లె ప్లాట్ల ఓనర్లకు కష్టంగా మారింది. కరోనా కరువుతో పట్టణాల నుంచి పల్లెకు చేరిన వారిలో ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంది. అసలే పనిలేక కష్టాల్లో ఉంటే ఎల్ఆర్ఎస్ కట్టాలన్న ఆర్డర్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.