చంద్రగ్రహణం సమయంలో చదవాల్సిన మంత్రాలు ... వాటి ఫలితాలు ఇవే..!

చంద్రగ్రహణం సమయంలో చదవాల్సిన మంత్రాలు ... వాటి ఫలితాలు ఇవే..!

చంద్రగ్రహణం సంభవించేందుకు ఇంకా ఎంతో సమయం లేదు.  ఈ రోజుసెప్టెంబర్ 7 వతేది రాత్రికి 9.58 గంటలకు ఏర్పడనుంది.  ఈ గ్రహణం చాలా శక్తి వంతమైనది.. అందరిపై గ్రహణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. గ్రహణ సమయంలో పట్టు స్నానం.. చేసిన ఈక్రింది తెలిపిన మంత్రాలు పఠిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ మంత్రాల గురించి తెలుసుకుందాం.. 

ఈ రోజు ( సెప్టెంబర్​ 7) రాహు గ్రస్త  చంద్రగ్రహణం కుంభరాశిలో  శతభిషం నక్షత్రంలో ఏర్పడుతుంది. శాస్త్రపరంగా, ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది. 

చంద్ర గ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. 

  • ఓం నమో నారాయణ..  అడ్డంకులను అధిగమించి కెరీర్‌లో విజయం ....  గ్రహణ దోషాలు తొలగిపోతాయి
  • ఓం గం గణపతయే నమః ...  గ్రహణం వల్ల కలిగే ఆటంకాలు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి 
  • ఓం హ్రీం నమః శివాయ..  కుటుంబ ఆనందం , శ్రేయస్సు కోసం
  • ఓం క్లీం కృష్ణాయ నమః..  స్పష్టత , విమర్శనాత్మక ఆలోచన కోసం
  • ఓం సోమాయ నమః.. చంద్రుని రక్షణ , ఆశీర్వాదం కోసం
  • ఓం హ్రీం సూర్యాయ నమః.. మంచి ఆరోగ్యం, కీర్తి మ, ప్రమోషన్ కోసం
  • ఓం నమో భగవతే వాసుదేవాయ ... రుణ తగ్గింపు , పురోగతి కోసం
  • ఓం మహా లక్ష్మీయై నమః...  ఆదాయం , కుటుంబ శ్రేయస్సు కోసం.
  • ఓం నరసింహాయ నమః...  శత్రువులను అధిగమించి మానసిక బలాన్ని పొందడానికి
  • ఓం విష్ణువే నమః.. ఆధ్యాత్మిక బలం, విద్య , ప్రయాణ ప్రయోజనాల కోసం
  • ఓం శనిచారాయ నమః..శని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి
  • ఓం హ్రీం కాలికాయై నమః...  ధైర్యం కోసం
  • ఓం నమో భగవతే రామానుజాయ..  ఆధ్యాత్మిక వృద్ధి , మనశ్శాంతి కోసం
  • ఓం నమః శివాయ ...  రాహు...కేతువుల ప్రభావం తగ్గుతుంది

మృత్యుంజయ మంత్రం : ఓం త్య్రం బకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ...
ఉర్వారుకమివ్ బన్ధనన్మృత్యోర్ముక్షీయ మామృత్యత్ ।  

ఇది జపించడం వలన  శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రం భయంకరమైన గ్రహణ ప్రభావాల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. ఇంకా ఆరోగ్యం , దీర్ఘాయువు, శ్రేయస్సు కలుగుతుంది. 

చంద్ర బీజ మంత్రం:   ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః ...చంద్రుడి అనుగ్రహం లభించడంతో పాటు మనసు శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది.

గాయత్రీ మంత్రం :  ఓం భూర్భువః స్వాః । తత్సవితుర్వరేణ్యమ్...  భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. ( యఙ్ఞోపవీతం ఉన్నవారు మాత్రమే దీనిని పఠించాలని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు)

 దుర్గా మంత్రం :  ఓం దున్ దుర్గాయై నమః ..అమ్మవారి అనుగ్రహంతో.. శత్రువులపై విజయం