న్యూఢిల్లీ: సీఐఈ ఆటోమోటివ్ ఎస్ఏలో 3.58 శాతం వాటాను తమ సబ్సిడరీ కంపెనీ మహీంద్రా ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ (మారిషస్) లిమిటెడ్ (ఎంఓఏసీఎంఎల్) అమ్మిందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ విలువ119 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,240 కోట్లు) .
మహీంద్రా షేర్లు గురువారం 0.6 శాతం పెరిగి రూ.3,672 వద్ద ముగిశాయి. సీఐఏ ఆటోమోటివ్ ఎస్ఏ హెడ్క్వార్టర్ స్పెయిన్లో ఉంది. ఈ కంపెనీ వెహికల్ పార్టులను తయారు చేస్తోంది. తాజా షేర్ల విక్రయం తర్వాత కూడా ఎంఓఏసీఎంఎల్కు అసోసియేట్ కంపెనీగా ఇది కొనసాగుతుంది.
