
- 20 బైక్ లను స్వాధీనం చేసుకున్న మాదాపూర్ పోలీసులు
మాదాపూర్, వెలుగు : పార్కింగ్ బైక్ లను టార్గెట్ గా చేసుకుని ఎత్తుకెళ్తున్న దొంగను మాదాపూర్పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 20 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మాదాపూర్పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన సత్యారం కృష్ణ(35) లంగర్హౌస్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. జల్సాలు చేసేందుకు కృష్ణ బైక్ లను ఎత్తుకెళ్లి అమ్ముతున్నాడు.
కాలేజీలు, వైన్స్, షాపింగ్మాల్స్, హాస్పిటల్స్వద్ద హ్యాండిల్లాక్వేయని బైక్ ల ప్లగ్వైర్లతో స్టార్ట్చేసి ఎత్తుకెళ్తున్నాడు. మహబూబ్నగర్కు చెందిన గొల్ల నరేష్(29), మెకానిక్ షకీల్అహ్మద్(32)కు అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. రెండేండ్లలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 20 బైక్ లను దొంగిలించాడు. నిఘా పెట్టిన మాదాపూర్ పోలీసులు శుక్రవారం నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో నరేష్, షకీల్, నారాయణపేట్కు చెందిన నర్సింహ పరారీ ఉన్నారని పోలీసులు తెలిపారు.