
ఖైరతాబాద్,వెలుగు : మహాత్మా జ్యోతిరావు ఫూలే గొప్ప సంస్కరణవాది అని, భావి తరాలకు గౌరవ ప్రదమైన జీవితం ఇచ్చేందుకు ఆయన ఎంతో పాటు పడ్డారని మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి పేర్కొన్నారు. జ్ఞానం సకల సమస్యలకు పరిష్కారమని భావించి విద్య కోసం ఫూలే పాటు పడ్డారని కొనియాడారు. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ఆవిర్భావ సభ సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. ఫూలే విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుపై ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ఫూలే ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఫ్రంట్కన్వీనర్ గా గట్టు రామచంద్రరావు, గౌరవ సలహాదారులుగా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, మాజీ స్పీకర్ మధు సూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ను ప్రకటించారు. ఈ సమావేశంలో రాజారాంయాదవ్, జూలూరు గౌరీశంకర్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.