దళితులెవరూ కేసీఆర్ మాట విని మోసపోవద్దు

దళితులెవరూ కేసీఆర్ మాట విని మోసపోవద్దు


దళితుల పేరు చెప్పుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు  పీసీసీ  ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ . దళిత వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి కామారెడ్డి జిల్లాకు వచ్చిన మధుయాష్కిగౌడ్ కు టెక్రియల్ బైపాస్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ ను రాజకీయంగా ఓడించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు మధుయాష్కి గౌడ్. దళితులను ప్రలోభపెట్టేoదుకే దళిత బంధువు స్కీం తీసుకొచ్చారని.. దళితులు ఎవరూ కేసీఆర్ మాట విని మోసపోవద్దని సూచించారు.