భోపాల్ : మధ్యప్రదేశ్ప్రభుత్వం మద్యతరగతి ప్రజలకు శ్రావణమాసం ఆఫర్ను ప్రకటించింది. జూలై 4 నుంచి ఆగస్టు 31 వరకు గ్యాస్సిలిండర్తీసుకున్నవారి నుంచి రూ.450 మాత్రమే వసూలు చేయనుంది. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేయనుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్చౌహాన్ అధ్యక్షతన భోపాల్లో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రి మండలి సమావేశంలో ఎంపీ సర్కార్పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మీటింగ్అనంతరం ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్మిశ్రా మీడియాతో మాట్లాడారు. శ్రావణమాసం సందర్భంగా వంట గ్యాస్సిలిండర్ ధర రూ.450గా మంత్రిమండలి నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రాయితీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్చేయనున్నామని, మిగిలిన మొత్తాన్ని అప్లికేషన్సమర్పించిన అనంతరం అందజేస్తామని వెల్లడించారు. ఆగస్టు 31 వరకు పెంచిన విద్యుత్బిల్లులను వాయిదావేసినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని రూ.2వేల నుంచి రూ.6వేలకు పెంచామన్నారు.